కార్గిల్ సెక్టార్లో ఐఈడీ పేలుడు.. జవాన్ మృతి..
జమ్ముకశ్మీర్లోని సరిహద్దుల ప్రాంతంలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందాడు. కార్గిల్ సెక్టార్లో ఆదివారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్గిల్ సెక్టార్లో విధులు..
జమ్ముకశ్మీర్లోని సరిహద్దుల ప్రాంతంలో ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందాడు. కార్గిల్ సెక్టార్లో ఆదివారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్గిల్ సెక్టార్లో విధులు నిర్వర్తిస్తుండగా.. ఓ పాత ఐఈడీ ల్యాండ్మైన్పై చూడకుండా అడుగు వేశాడు. దీంతో ఆ ల్యాండ్మైన్ పేలి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయాన్ని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు అనేక చోట్ల ఐఈడీలు అమర్చారని.. అయితే అందులో చాలా వాటిని నిర్వీర్యం చేసింది సైన్యం. అయితే ఇంకా కూడా పలుచోట్ల పేలని ఐఈడీలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు జవాన్.. చూడకుండా ఐఈడీపై అడుగు వేయడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.
One Indian Army jawan lost his life near the Line of Control in Kargil sector, when he accidentally stepped on an old unexploded explosive device: Indian Army officials pic.twitter.com/aEKzo7RzdK
— ANI (@ANI) July 19, 2020