ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ రెండు సార్లు భేటీ
ఇండో-చైనా బోర్డర్ లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ముగ్గురు భారత సైనికులు మృతి చెందిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీతో మంగళవారం రెండు సార్లు సమావేశమై తాజా పరిణామాలను వివరించారు..
ఇండో-చైనా బోర్డర్ లో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ముగ్గురు భారత సైనికులు మృతి చెందిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాని మోదీతో మంగళవారం రెండు సార్లు సమావేశమై తాజా పరిణామాలను వివరించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొన్నారు. తీసుకోవలసిన తదుపరి చర్యలపై ఈ భేటీలో చర్చించారు. అంతకు ముందే డిఫెన్స్ చీఫ్ కూడా రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. ఈ సమావేశ వివరాలు తెలియవలసి ఉంది.