India Covid-19: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. ఒమిక్రాన్ బాధితులు ఎంతమంది ఉన్నారంటే..?
India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య
India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భారత్లో ఇప్పటివరకు 415 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే.. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) దేశవ్యాప్తంగా 7,189 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 387 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 77,032 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 578 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.30 శాతానికిపైగా ఉంది.
India reports 7,189 new #COVID19 cases, 7,286 recoveries, and 387 deaths in the last 24 hours.
Active cases: 77,032 Total recoveries: 3,42,23,263 Death toll: 4,79,520
Total number of #Omicron cases 415
Total Vaccination: 141.01 Cr pic.twitter.com/BLiT1E5rjZ
— ANI (@ANI) December 25, 2021
కాగా నిన్న కరోనా నుంచి 7,286 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,23,263 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,79,520 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 141.01 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: