India Covid-19: దేశంలో వెంటాడుతున్న ఒమిక్రాన్ భయం.. పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎన్ని నమోదయ్యాయంటే..?
India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ
India Corona Updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసులు.. క్రమంగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో కొత్త వేరియంట్ దడపుట్టిస్తోంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. భారత్లో ఇప్పటివరకు 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే.. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. ఇటీవల కేసుల సంఖ్య భారీగా తగ్గిన విషయం తెలిసిందే. రోజూ 10వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నా.. పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గడిచిన 24 గంటల్లో (గురువారం) దేశవ్యాప్తంగా 6,650 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 374 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 77,516 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 576 రోజుల తర్వాత క్రీయాశీల కేసుల సంఖ్య ఈ గణనీయంగా తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో మార్చి తర్వాత రికవరీ రేటు గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది.
India reports 6,650 new #COVID19 cases, 7,051 recoveries, and 374 deaths in the last 24 hours.
Active cases: 77,516 Total recoveries: 3,42,15,977 Death toll: 4,79,133
Total number of #Omicron cases 358
Total Vaccination: 1,40,31,63,063 pic.twitter.com/0PrTpLhIHi
— ANI (@ANI) December 24, 2021
కాగా నిన్న కరోనా నుంచి 7,051 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,42,15,977 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఈ మహమ్మారితో 4,79,133 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,40,31,63,063 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: