ఇండియా.. కరోనా అప్ డేట్స్.. పెరిగిన కేసులు 62 వేలు
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 62 వేలకు చేరుకుంది. మృతుల సంఖ్య 2,109 కి పెరిగింది. కొత్తగా 3277 కేసులు నమోదు కాగా..
ఇండియాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 62 వేలకు చేరుకుంది. మృతుల సంఖ్య 2,109 కి పెరిగింది. కొత్తగా 3277 కేసులు నమోదు కాగా.. గత 24 గంటల్లో 128 మంది రోగులు మరణించారు. అటు రీకవరీ రేటు 29.91 శాతం ఉందని, అంటే సుమారు 17,846 మంది రోగులు కోలుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా ఆర్ టీ.. పీసీఆర్ టెస్టులకు సంబంధించి ఈ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన నిబంధనల ప్రకారం స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో చికిత్స పొందినవారు టెస్ట్ లేకుండానే డిశ్చార్జ్ కావచ్ఛు. తప్పనిసరి పరీక్షలకు స్వస్తి చెప్పారు. తీవ్ర వ్యాధి లక్షణాలున్నాయని తేలినవారికే చికిత్స చేస్తారు. మొత్తానికి సీరియస్ కేసులకే పరీక్షలు నిర్వహించనున్నారు. బహుశా రోజురోజుకీ కరోనా కేసుల హెచ్చుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది.