India Corona Cases: ఉపశమనం.. తగ్గిన కరోనా కేసులు.. ఎంతమంది చనిపోయారంటే..?
Covid-19 cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. పెరుగుతున్న కోవిడ్ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 40వేలకు
Covid-19 cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. పెరుగుతున్న కోవిడ్ కేసులు మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కేసుల సంఖ్య 40వేలకు దిగువన నమోదయ్యాయి. శనివారంతో పోల్చుకుంటే ఆదివారం మూడు వేలు వరకు కేసులు తగ్గాయి. గత 24గంటల వ్యవధిలో కొత్తగా 38,164 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 499 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,11,44,229 కి పెరగగా.. మరణాల సంఖ్య 4,14,108 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది.
ఆదివారం కరోనా నుంచి 38,660 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,03,08,456 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,21,665 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 40కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటినుంచి సోమవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 40,64,81,493 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
India reports 38,164 new #COVID19 cases, 38,660 recoveries, and 499 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 3,11,44,229 Active cases: 4,21,665 Total recoveries: 3,03,08,456 Death toll: 4,14,108
Total vaccination: 40,64,81,493 pic.twitter.com/Wj56sQwlEl
— ANI (@ANI) July 19, 2021
Also Read: