అన్నీ అబధ్ధాలే ! ఐరాసలో పాకిస్తాన్ పై భారత్ ఫైర్

ఐరాస 75 వ సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ మండిపడింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్ఛే హక్కును తమకు ఇవ్వాలని కోరిన ఇండియా-కాశ్మీర్ అంశం...

అన్నీ అబధ్ధాలే ! ఐరాసలో పాకిస్తాన్ పై భారత్ ఫైర్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 26, 2020 | 10:09 AM

ఐరాస 75 వ సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ మండిపడింది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్ఛే హక్కును తమకు ఇవ్వాలని కోరిన ఇండియా-కాశ్మీర్ అంశం ముమ్మాటికీ భారత ఆంతరంగిక వ్యవహారాల పరిధిలోకే వస్తుందని స్పష్టం చేసింది. ఆప్రాంతం భారత అంతర్భాగంలోనిదే అని పేర్కొంది. కాశ్మీర్ లో మానవ హక్కులను కాలరాస్తున్నారన్న ఇమ్రాన్ ఖాన్ విమర్శలను ఖండిస్తూ.. ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. ఈ అంశానికి శాంతియుత పరిష్కారం కావాలని తాము కోరుతున్నామని అంతకుముందు ఇమ్రాన్ అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపట్ల నిరసన వ్యక్తం  చేస్తూ హాలు నుంచి ఇండియన్ డెలిగేట్ మిజిటో వినిటో వాకౌట్ చేశారు.