కేంద్రం నిర్ణయానికి ఆప్ మద్దతు.. కేజ్రీవాల్ ట్వీట్
దశాబ్దాల తరబడి సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్ విషయంలో స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇకనుంచైనా జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రంతో , ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మాట్లాడే కేజ్రీవాల్.. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ విధంగా కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించడం చర్చనీయాంశంగా […]
దశాబ్దాల తరబడి సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్ విషయంలో స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. ఇకనుంచైనా జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కేంద్రంతో , ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా మాట్లాడే కేజ్రీవాల్.. ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ విధంగా కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించడం చర్చనీయాంశంగా మారింది.
We support the govt on its decisions on J & K. We hope this will bring peace and development in the state.
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 5, 2019