Uttar pradesh: దారుణం.. రెండో సారి ఆ పనికి భార్య నో చెప్పిందని.. భర్త ఏం చేశాడంటే..
దాంపత్య జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలోనే చాలా మందికి గొడవలు జరుగుతుంటాయి. బేధాభిప్రాయాలు వస్తుంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే పడక గదిలో భర్తకు నచ్చినట్లుగా భార్య, భార్యకు...
దాంపత్య జీవితంలో శృంగారం చాలా ముఖ్యమైనది. ఈ విషయంలోనే చాలా మందికి గొడవలు జరుగుతుంటాయి. బేధాభిప్రాయాలు వస్తుంటాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే పడక గదిలో భర్తకు నచ్చినట్లుగా భార్య, భార్యకు నచ్చినట్లుగా భర్త నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం శారీరక చర్య అని భావిస్తూ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. భాగస్వామికి ఇష్టం ఉన్నా లేకున్నా బలవంతంగా కోరడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంటారు. ఇది రానురాను తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. వివాహేతర సంబంధాలు, హత్యలు, దాడులు జరుగుతుంటాయి. సుఖ సంతోషాలను పంచాల్సిన శృంగారం.. చిన్న చిన్న తప్పిదాల వల్ల నేరంగా మారుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో అలాంటి ఘటనే జరిగింది. తన భార్య ఒకే రాత్రి రెండో సారి శృంగారానికి ఒప్పుకోలేదనే కోపంతో భర్త దారుణానికి పాల్పడ్డాడు.
ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహీ జిల్లాకు చెందిన మహ్మద్ అన్వర్ కు ఓ మహిళతో తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అమ్రోహాలో అన్వర్ బేకరీ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతోంది. ఇటీవలే ఒక రోజు రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రెండోసారి శృంగారం వద్దు అని భార్య చెప్పినందుకు భర్తకు కోపం వచ్చింది. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. కుటుంబ సభ్యుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్వర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
భార్యా భర్తల మధ్య దాంపత్య జీవితం అనేది మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలే గానీ.. ఇలా మాయని మచ్చలా మారకూడదు. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అంత కంటే కొంచెం ఎక్కువ అనే ఫీలింగ్ రాగలగాలి. ఎవరో ఒకరు కాస్త తగ్గగలిగితే సంసార జీవితం ఎలాంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి