Corona: మహారాష్ట్రలో నాలుగు నెలల గరిష్ఠానికి కరోనా.. భారీగా బయటపడుతున్న కొత్త కేసులు
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం మహారాష్ట్ర(Maharashtra), కేరళ రాష్ట్రాల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన..
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం మహారాష్ట్ర(Maharashtra), కేరళ రాష్ట్రాల్లోనే అధిక సంఖ్యలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, కరోనా ఫోర్త్ వేరియంట్కు(Fourth Wave in India) సంకేతమా? అనే భయాందోళనలు చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు అప్రమత్తమై, వైరస్ను అరికట్టేందుకు చర్యలు చేపట్టింది మహారాష్ట్రలో బుధవారం 4 నెలల్లో అత్యధిక కొవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,701 కొత్త కేసులు నమోదయ్యాయి. రాజధాని ముంబయి(Mumbai) లోనే 1,765 మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు నాలుగు నెలల్లో ఇదే అత్యధికమని అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో మహారాష్ట్రలో యాక్టీవ్ కేసుల సంఖ్య 9,806గా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న రాష్ట్రంలో 2,797 కొత్త కేసులు నమోదయ్యాయి.
మరోవైపు.. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బస్సులు, రైళ్లు, సినిమా హాళ్లు, ఆడిటోరియంలు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాస్క్లు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. కేసుల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాలకు లేఖ రాశారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైతే ముందు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి