Heavy Rains: ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు..!
Heavy Rains: నైరుతి బుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా వానలు జోరందుకున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైని..
Heavy Rains: నైరుతి బుతుపవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా వానలు జోరందుకున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబైని వర్షాలు ముంచెత్తాయి. నగరంలోని పలు ప్రాంతాలు నదులను తలపించాయి. ట్రాఫిక్ అంతరాయంతో ముంబై నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల భారీ ఆస్తినష్టం జరిగింది. మరోరెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. దీంతో ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు అధికారులు.
నైరుతి ప్రభావం దేశవ్యాప్తంగా ఉధృతమైంది. వానకు తోడు చాలా చోట్ల ఈదురుగాలులు ప్రాణాలమీదకు తెస్తున్నాయి. కేరళలో వయనాడ్లో దారిన పోయే వ్యక్తిపై అమాంతం పెద్ద చెట్టు కూలిపడింది. ఇటు కర్నాటకలోనూ నేషనల్ హైవేపై వెళ్తున్న ఓ కారుపై పెద్ద చెట్టు కొమ్మ విరిగిపడింది. ఇక కొండ ప్రాంతాల్లో జలపాతాల నుంచి జలధార కురుస్తోంది. ఇళ్లలోకి భారీగా వరద నీరు వస్తుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో కర్ణాటకలో ఎక్కడ చూసినా నీళ్లే కనపడుతున్నాయి. భారీ వర్షాలతో దక్షిణ కర్నాటకలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. స్కూళ్లు,కాలేజీలు పూర్తిగా మూసివేశారు.
హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కులు ప్రాంతంలో వరద కారణంగా పలు చోట్ల ఇళ్లు భారీగా దెబ్బతిన్నాయి. వరద ఉద్ధృతికి ఆరుగురు కొట్టుకుపోయినట్లు అధికారులు చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొండ ప్రాంతం నుంచి భారీగా వరద పారుతోంది.
ఉత్తరాఖండ్లో కూడా భారీవర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఘాట్రోడ్ల్లో వరద ముంచెత్తింది. ఉత్తరకాశీ-యమునోత్రి హైవేపై భారీగా వరద చేరడంతో రోడ్డు మూసివేశారు. దీంతో రోడ్డుకు రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి.ఇటు లోయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరుతుండడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటు కాశ్మీర్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ ప్రాంతాల నుంచి భారీగా వరద రావడంతో బురద కొట్టుకువస్తోంది. దీంతో ఇళ్లలో మొత్తం బురద నిండిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి