Gandhinagar Civic Polls: జీఎంసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ తల్లి హీరాబెన్..
Gandhinagar Civic Polls: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్(జీఎంసీ) ఎన్నికల్లో..
Gandhinagar Civic Polls: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి హీరాబెన్ గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్(జీఎంసీ) ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాయిసన్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో హీరాబెన్ తన ఓటును వేశారు. ప్రధాని మోదీ సోదరుడు పంకజ్ మోడీతో కలిసి రాయిసన్ గ్రామంలో హీరాబెన్ నివవిస్తున్న విషయం తెలిసిందే. 99 ఏళ్ల హీరాబెన్ ఓటు వేయడం కోసం తన కోడలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్కు వచ్చారు. వారి సాయంతో హీరాబెన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Gujarat: Heeraben Modi, the mother of PM Narendra Modi, casts vote in Gandhinagar Municipal Corporation (GMC) elections at a polling centre in Raysan village in the city pic.twitter.com/KddJtXzg1X
— ANI (@ANI) October 3, 2021
గుజరాత్లో గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్, ఓఖా, భన్వాద్, థారా మున్సిపాలిటీలకు ఇవాళ ఎన్నికల పోలింగ్ జరిగింది. జీఎంసీలో ఉన్న 44 సీట్లలో మొత్తం 161 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ నుండి 44 మంది, ఆప్ నుంచి 40 మంది ఉన్నారు. ఇదిలాఉంటే.. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అలాగే జిల్లా, తాలూకా, పంచాయితీలలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.
PM @narendramodi mother cast her vote for Gandhinagar Municipal corporation election at the age of 99 years #GandhinagarElection pic.twitter.com/hf1mB0e3T8
— Gopi Maniar ghanghar (@gopimaniar) October 3, 2021
Also read:
Actress Khushbu : వయసు పెరుగుతున్నా.. తరగని అందంతో మతిపోగొడుతున్న సీనియర్ బ్యూటీ..