Gujarat BJP: గుజరాత్లో బీజేపీకి బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎంపీ.. త్వరలో పదవికి కూడా..
గుజరాత్లో బీజేపీకి ఆ పార్టీ నేత షాక్ ఇచ్చారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ మనుసుఖ్ వాసవ.. గుజరాత్లోని భరూచ్..
Gujarat BJP: గుజరాత్లో బీజేపీకి ఆ పార్టీ నేత షాక్ ఇచ్చారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంపీ మనుసుఖ్ వాసవ.. గుజరాత్లోని భరూచ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేసి గెలిచారు. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అయితే, సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన వాసవ.. ఎంఓఈఎఫ్సిసి నోటిఫికేషన్ను రద్దు చేసి, నర్మదా జిల్లా పరిధిలోని 121 గ్రామాలను ‘ఈకో సెన్సిటీవ్ జోన్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేఖ రాసిన రోజైనా గడవక ముందే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం సంచలనం రేకెత్తించింది. అయితే, పార్టీతో పాటు ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తానని వాసవ ప్రకటించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో స్పీకర్ను కలిసి తన పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు.
Also read:
Rajinikanth Political Entry: రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి అసలు కారణం ఇదేనా..?