Uttarakhand joshimath Dam News: పోటెత్తిన వరదలు, ఉప్పొంగిన నదులు, ఉత్తరాఖండ్లో వణికిపోయిన చమోలీ జిల్లా.
ఉత్తరాఖండ్లో ఒక్కసారిగా వఛ్చి పడిన వరదలతో ముఖ్యంగా చమోలీ జిల్లా వణికిపోయింది. ఈ జిల్లాకు సమీపంలోని అలకానంద, ధౌలి గంగా నదులు..
Uttarakhand joshimath Dam News: ఉత్తరాఖండ్లో ఒక్కసారిగా వఛ్చి పడిన వరదలతో ముఖ్యంగా చమోలీ జిల్లా వణికిపోయింది. ఈ జిల్లాకు సమీపంలోని అలకానంద, ధౌలి గంగా నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రుషి గంగ పవర్ ప్రాజెక్టు (డ్యామ్) వరదనీటితో నిండిపోయింది. డ్యాం నుంచి నీరు పొంగి ప్రవహించడంతో సమీప గ్రామాలు జల సమాధి అయ్యాయి. ఈ రాష్ట్రంలో అలకానంద, ధౌలి గంగానదులతో బాటు బాగేశ్వర్, తెహ్రి గర్వాల్, అల్మోరా తదితర చిన్నా చితకా నదులు ఉన్నాయి. ఈ వరదలతో బాటు తపోవన్ రెయినీ ఏరియాలో గ్లేసియర్ (హిమప్రాంతం) కూడా ఒక్కసారిగా దీని ప్రభావానికి గురికావడంతో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఫలితంగా డ్యాం పూర్తిగా దెబ్బ తిన్నది.
ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా భారీగా ప్రాణ, ఆస్థి నష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నప్పటికీ ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వదంతులను నమ్మవద్దని కోరారు. సర్వే కోసం అయన హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. కాగా 150 మంది మిస్సింగ్ అని వార్తలు వస్తున్నాయి.
కాగా- విష్ణు ప్రయాగ్, జోషీ మఠ్, రుద్ర ప్రయాగ్, రిషికేష్, హరిద్వార్ తదితర ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ హెచ్ఛరికలు జారీ చేశారు. ఎన్డీ ఆర్ ఎఫ్ బృందాలను, ఇతర సహాయక టీమ్ లను సిధ్ధంగా ఉంచారు.
Also Read: