Ghulam Nabi Azad: మన రక్తం ధారపోసి.. కాంగ్రెస్పై నిప్పులు.. జమ్ముకశ్మీర్లో గులాంనబీ ఆజాద్ భారీ ర్యాలీ..
జమ్ములో భారీ రోడ్షో నిర్వహించారు ఆజాద్ . సైనిక్ కాలనీలో బహిరంగసభలో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. గులాంనబీఆజాద్కు మద్దతుగా..
కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన గులాంనబీ ఆజాద్ ఇవాళ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు. జమ్ములో భారీ రోడ్షో నిర్వహించారు ఆజాద్ . సైనిక్ కాలనీలో బహిరంగసభలో ఆయన కొత్త పార్టీని ప్రకటిస్తున్నారు. గులాంనబీఆజాద్కు మద్దతుగా దాదాపు 100 మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు ఆజాద్. రాహుల్గాంధీని మరోసారి టార్గెట్ చేశారు గులాంనబీఆజాద్. 53 ఏళ్ల నుంచి తాము కాంగ్రెస్ కోసం రక్తం ధారబోశామని, కాని ఇప్పుడు పార్టీ కంప్యూటర్కు , ట్విట్టర్కు మాత్రమే పరిమితం అయ్యిందని విమర్శించారు. రాహుల్ యువరాజు లాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
గులాంనబీఆజాద్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం జరుగుతోంది. బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉండదని ప్రకటించారు ఆజాద్. నేషనల్ కాన్ఫరెన్స్ లేదా పీడీపీతో పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గులాంనబీఆజాద్ గత వారం పార్టీని వీడారు. తనకు అందరూ సమానమే అన్నారు ఆజాద్.
కాంగ్రెస్ రక్తం, చెమటతో..
కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘మన రక్తం, చెమటతో కాంగ్రెస్ని ఏర్పాటు చేశాం.. అది కంప్యూటర్లతో కాదు, ట్విట్టర్తో కాదు, మెసేజ్లతో తయారైంది కాదు.. మనల్ని అప్రతిష్టపాలు చేసే వారి రీచ్ కేవలం ఆన్లోనే ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం