జమ్మూ కాశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదుల ఎన్ కౌంటర్

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కుల్గాం, పుల్వామా జిల్లాల్లో గత 16 గంటల్లో భద్రతాదళాలు వీరిని కాల్చి చంపాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన టెర్రరిస్టుల్లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని సైనిక వర్గాలు తెలిపాయి. కాగా నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన ఎన్ కౌంటర్లు  శనివారం ఉదయం ఎనిమిది గంటలవరకు కొనసాగాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. పారిపోయినట్టు భావిస్తున్న […]

జమ్మూ కాశ్మీర్ లో నలుగురు ఉగ్రవాదుల ఎన్ కౌంటర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 10, 2020 | 7:47 PM

జమ్మూ కాశ్మీర్ లో జరిగిన వేర్వేరు సంఘటనల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కుల్గాం, పుల్వామా జిల్లాల్లో గత 16 గంటల్లో భద్రతాదళాలు వీరిని కాల్చి చంపాయి. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన టెర్రరిస్టుల్లో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని సైనిక వర్గాలు తెలిపాయి. కాగా నిన్న రాత్రి నుంచి ప్రారంభమైన ఎన్ కౌంటర్లు  శనివారం ఉదయం ఎనిమిది గంటలవరకు కొనసాగాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి. పారిపోయినట్టు భావిస్తున్న మరికొందరు టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు.