మరింత విషమించిన అజిత్ జోగి ఆరోగ్యం..!
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై వైద్యం అందిస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్పై వైద్యం అందిస్తున్నట్లు వారు వెల్లడించారు. అజిత్ జోగి నాడీ వ్యవస్థ పనితీరు పూర్తిగా పడిపోయిందని.. ఆయన కోమాలోనే ఉన్నారని వారు వివరించారు. కాగా గుండెనొప్పి, శ్వాస సంబంధ సమస్యలతో ఈ నెల 9న జోగి రాయ్పూర్లో ఓ ఆసుపత్రిలో చేరారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఖేమ్కా మాట్లాడుతూ.. అజిత్ జోగి నాడీ వ్యవస్థ పనితీరు పూర్తిగా నిలిచిపోయింది. మెదడు పనితీరును మెరుగుపర్చడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఇయర్ ఫోన్ ద్వారా ఆయనకు ఇష్టమైన పాటలు వినిపిస్తున్నాము. ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం లేదు. గుండె పనితీరు, బీపీ అంతా సరిగానే ఉంది అని తెలిపారు.
Read This Story Also: Breaking: మోదీ ప్రసంగం.. లాక్డౌన్ 4.0 తప్పనిసరి