బ్రేకింగ్, అయిదుగురు చొరబాటుదారుల కాల్చివేత
పంజాబ్ లోని పాక్ సరిహద్దుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న అయిదుగురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ దళాలు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపాయి..
పంజాబ్ లోని పాక్ సరిహద్దుల ద్వారా ఇండియాలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్న అయిదుగురు చొరబాటుదారులను బోర్డర్ సెక్యూరిటీ దళాలు శనివారం తెల్లవారుజామున కాల్చి చంపాయి. తరన్ తరన్ జిల్లాలోని ఖేమ్ కరన్ ద్వారా దొంగచాటుగా వీరు దేశంలో ప్రవేశించబోయారని, గస్తీ తిరుగుతున్న దళాలపై కాల్పులు జరిపారని సైనిక వర్గాలు తెలిపాయి. అయితే బీ ఎస్ ఎఫ్ దళాల ఎదురు కాల్పుల్లో మరణించారని ఈ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.