ఆ ఎయిరిండియా పైలట్లకు కరోనా పాజిటివ్ లక్షణాలు లేవట
ఐదుగురు ఎయిరిండియా పైలట్లకు కరోనా పాజిటివ్ లక్షణాలు లేవని తేలింది. గత శనివారం 77 మంది పైలట్లకు పరీక్షలు నిర్వహించగా.. ఈ ఐదుగురికి పాజిటివ్ అని వచ్చింది. అయితే మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు....
ఐదుగురు ఎయిరిండియా పైలట్లకు కరోనా పాజిటివ్ లక్షణాలు లేవని తేలింది. గత శనివారం 77 మంది పైలట్లకు పరీక్షలు నిర్వహించగా.. ఈ ఐదుగురికి పాజిటివ్ అని వచ్చింది. అయితే మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు వీరిలో ఆ లక్షణాలు లేవని వెల్లడైంది. బహుశా టెస్ట్ కిట్లలోనే లోపాలున్నట్టు భావిస్తున్నారు. వీరికి ఎలాంటి సింప్టమ్స్ లేవని, అయితే హోం క్వారంటైన్ కి వెళ్లాలని సూచించామని ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. ఒక ఇంజనీరుకు, డ్రైవర్ కు చేసిన టెస్టుల్లో వారికి పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. ముంబైలోని పాత అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని ఎయిరిండియా మెడికాన్ భవన్ లో ఈ పైలట్లకు టెస్టులు నిర్వహించారు. వీరంతా ముంబై వాసులు. వీరి టెస్ట్ సాంపిల్స్ ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న కేంద్రానికి పంపారు. అక్కడ ఈ నమూనాలను మళ్ళీ పరీక్షించనున్నారు.