నవంబరులో నరేంద్ర మోదీ, జీ జిన్ పింగ్ భేటీ
లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వచ్ఛే నెల వర్చ్యువల్ గా భేటీ కాబోతున్నారు. ఇది వారి తొలి సమావేశం
లడాఖ్ వాస్తవాధీన రేఖ వద్ద భారత-చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ వచ్ఛే నెల వర్చ్యువల్ గా భేటీ కాబోతున్నారు. ఇది వారి తొలి సమావేశం కానుంది. బ్రిక్స్’ సమ్మిట్ ను పురస్కరించుకుని జరిగే ఈ భేటీలో ఇద్దరు అగ్రనేతలూ ప్రపంచ తాజా పరిస్థితులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. నవంబరు 17 న మోడీ, జీ జిన్ పింగ్ భేటీ అవుతారని, ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు తీసుకోవలసిన చర్యలపై చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదికి గాను రష్యా ఈ కూటమికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తోంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా ఈ కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి.