Mark Zuckerberg: అఖిలేష్‌ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మార్క్ జుకర్‌బర్గ్ సహా 49 మందిపై కేసు..

Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై వివాదాస్పద పోస్ట్ చేసిన ఆరోపణలపై ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై కేసు నమోదైంది. కన్నౌజ్ జిల్లాలో

Mark Zuckerberg: అఖిలేష్‌ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మార్క్ జుకర్‌బర్గ్ సహా 49 మందిపై కేసు..
Mark Zuckerberg Akhilesh Ya
Follow us

|

Updated on: Dec 01, 2021 | 4:27 PM

Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై వివాదాస్పద పోస్ట్ చేసిన ఆరోపణలపై ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌పై కేసు నమోదైంది. కన్నౌజ్ జిల్లాలోని కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో ఫేస్‌బుక్‌ చీఫ్‌ జుకర్‌బర్గ్ సహా మరో 49 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అయితే.. అఖిలేశ్‌పై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఎలాంటి పోస్ట్‌ పెట్టలేదు, కానీ ఫేస్‌బుక్‌ వేదికను దీని కోసం ఉయోగించినందుకు ఆయన్ను కూడా ఈ కేసులో చేర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా, సరహతి గ్రామస్థుడు అమిత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అఖిలేశ్ యాదవ్‌ను కించపరుస్తూ, అవమానకరంగా ఓ ఫేస్‌బుక్‌ పేజ్‌ను నిర్వహిస్తున్నారని అమిత్ పేర్కొన్నాడు. అఖిలేశ్‌ను అవమానిస్తూ ‘బువా బబువా’ పేరుతో పేజ్‌ను నిర్వహిస్తున్నారని కోర్టుకు తెలిపారు.

ఆయన ఫిర్యాదు మేరకు ఫేస్‌బుక్‌ (మెటా) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తోపాటు, మరో 49 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అఖిలేశ్‌ యాదవ్‌పై కొందరు అసభ్యకరంగా పోస్టులు పెడుతుండటంతో.. అమిత్ కుమార్ మే 25న కన్నౌజ్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అమిత్ పిటిషన్‌పై విచారణ ప్రారంభించిన కోర్టు.. సరైన ఆధారాలు సమర్పించడంతో… కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ధరంవీర్ సింగ్ పోలీసులను ఆదేశించారు.

కోర్టు ఆదేశాల అనంతరం.. ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే.. ముందు మార్క్ జుకర్‌బర్గ్‌ పేరుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినప్పటికీ.. ఆ తర్వాత ఆయన పేరును వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. ఫేస్‌బుక్ పేజ్ యూజర్‌తోపాటు మరికొంతమందిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also Read:

Car Accident: వ్యవసాయ బావిలో పడ్డ కారు.. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్‌ దగ్గర ప్రమాదం.. కారులో ఎంత మంది ఉన్నారో..

Chanakya Nithi: మూర్ఖులతో వాదించకండి.. అలా చేయడం ద్వారా మన సమయం వృధా.. ఎందుకంటే..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?