అన్న‌దాత‌కు అండ‌గా.. రేపు రైతులకు మద్దతుగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నిరాహార దీక్ష‌

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం తాను ఒక రోజు నిరహార దీక్ష‌ చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. ఆప్ కార్యకర్తలతో పాటు..

అన్న‌దాత‌కు అండ‌గా.. రేపు రైతులకు మద్దతుగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నిరాహార దీక్ష‌
Follow us

|

Updated on: Dec 13, 2020 | 6:03 PM

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం తాను ఒక రోజు నిరహార దీక్ష‌ చేయనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. ఆప్ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలు కూడా ఒక్క రోజు నిరాహార దీక్ష‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం తన అహంకారం వీడాలని కేజ్రీవాల్ అన్నారు.

రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా మూడు చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు భరోసా ఇస్తూ కొత్త చట్టం తీసుకురావాలని కోరారు. మరో వైపు రైతులు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అయినా కేంద్రం వెనక్కి తగ్గకపోవడంతో రేపు దేశ వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాల‌ని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.