కుల్గాంలో కొనసాగుతున్న ఉగ్రవేట

జమ్ముకశ్మీర్‌లో శనివారం తెల్లా వారుజామునుంచే ఉగ్రవేట కొనసాగుతోంది. కుల్గాం ప్రాతంలో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు వీరిపై కాల్పులకు..

కుల్గాంలో కొనసాగుతున్న ఉగ్రవేట
Follow us

| Edited By:

Updated on: Aug 09, 2020 | 6:43 AM

జమ్ముకశ్మీర్‌లో శనివారం తెల్లా వారుజామునుంచే ఉగ్రవేట కొనసాగుతోంది. కుల్గాం ప్రాతంలో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపడుతుండగా.. ఉగ్రవాదులు వీరిపై కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు.. ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు చేపట్టాయి. కుల్గాం ప్రాంతంలోని సిగ్నాపూర్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. అయితే ఇంకా ఈ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతుందని.. కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు