మహారాష్ట్రలో మళ్లీ భూ ప్రకపంనలు
మహారాష్ట్రలో మరోసారి భూకంపం సంభవించింది. పాల్ఘర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 1.19 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 2.8 మాగ్రిట్యూడ్గా..
మహారాష్ట్రలో మరోసారి భూకంపం సంభవించింది. పాల్ఘర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున 1.19 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 2.8 మాగ్రిట్యూడ్గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. కాగా, గత కొద్ది రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా భూకంపం సంభవిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు.
An earthquake of magnitude 2.8 on the Richter scale occurred today at 1:19 am in Palghar, Maharashtra: National Centre for Seismology (NCS)
— ANI (@ANI) July 28, 2020