Andaman: అండమాన్లో అర్థరాత్రి అలజడి.. భయంతో ఇళ్లలోనుంచి పరుగులు తీసిన ప్రజలు..
Earthquake In Andaman: అండమాన్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్దరాత్రి భారీ సంభవించిన భారీ భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు.
Earthquake In Andaman: అండమాన్లో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్దరాత్రి భారీ సంభవించిన భారీ భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లల్లోనుంచి పరుగులు తీశారు. అండమాన్ సముద్రంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ ఘటనను ధ్రువీకరించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. మంగళవారం రాత్రి 12.15 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. దాని కేంద్రం అండమాన్ సముద్రంలో ఉన్నట్లు పేర్కొంది. భూకంపం కేంద్రం 77 కి.మీ లోపల ఉన్నట్లు పేర్కొంది. అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అండమాన్ సముద్రంలో 77 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది.
An earthquake of magnitude 4.9 occurred today at 00:15:40 IST; Latitude: 12.60 & Longitude: 93.42, Depth: 77 Km, Location: Andaman Sea, India: National Center for Seismology pic.twitter.com/jXpNwxl4g8
ఇవి కూడా చదవండి— ANI (@ANI) January 31, 2023
అంతకుముందు కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అండమాన్, నికోబార్ దీవులకు 253 కిమీ దూరంలో ఉన్న పోర్ట్ బ్లెయిర్ వద్ద నవంబర్ 10న తెల్లవారుజామున 2:29 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదు. అంతకుముందు కూడా సెప్టెంబర్ 2,3 తేదీల్లో భూకంపం సంభవించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..