హాస్పిటల్స్పై దాడులు చేస్తే ఊచలు లెక్కపెట్టాల్సిందే..
హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడులు చేసిన వారికి మూడేళ్లనుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించేలా కేంద్ర ఆరోగ్యశాఖ ముసాయిదా బిల్లు రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలోనే ఈ ముసాయిదాను బహిర్గతం చేయనున్నట్టు కేంద్రమంత్రి హర్షవర్ధన్ మంగళవారం వెల్లడించారు. హాస్పిటల్స్పై ఎవరైనా దాడిచేసినా, అక్కడ ఎలాంటి […]
హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రాణాలు కాపాడే వైద్యులపై దాడులు చేసిన వారికి మూడేళ్లనుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరిమానా విధించేలా కేంద్ర ఆరోగ్యశాఖ ముసాయిదా బిల్లు రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు త్వరలోనే ఈ ముసాయిదాను బహిర్గతం చేయనున్నట్టు కేంద్రమంత్రి హర్షవర్ధన్ మంగళవారం వెల్లడించారు.
హాస్పిటల్స్పై ఎవరైనా దాడిచేసినా, అక్కడ ఎలాంటి విధ్వంసానికి పాల్పడినా ఆరు నుంచి ఐదేళ్ల శిక్షతోపాటు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా కూడా విధించేలా ముసాయిదాను రూపొందించినట్టు తెలుస్తోంది.