రోడ్లు, రైళ్ల ట్రాక్ లపై నడుస్తూ వెళ్ళకండి.. వలస కార్మికులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభ్యర్థన
వలస కూలీల దుస్థితిపై చలించిపోయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నగర రోడ్లు, రైళ్ల పట్టాలపై నడుస్తూ వెళ్ళకండి అని వారిని అభ్యర్థించారు. వారి కోసం తమ ప్రభుత్వం తగిన వసతి కలిస్తుందని..
వలస కూలీల దుస్థితిపై చలించిపోయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. నగర రోడ్లు, రైళ్ల పట్టాలపై నడుస్తూ వెళ్ళకండి అని వారిని అభ్యర్థించారు. వారి కోసం తమ ప్రభుత్వం తగిన వసతి కలిస్తుందని, ఆహార సౌకర్యం కూడా కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు తక్షణమే అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. వలస కార్మికులను తరలించేందుకు ఉద్దేశించిన శ్రామిక్ రైళ్లను మరిన్ని సమకూర్చవలసిందిగా కేంద్రాన్ని కోరుతామని ఆయన చెప్పారు. దయచేసి వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లకు తరలాలని కోరారు. వీరికి ఏవైనా అసౌకర్యాలు కలిగితే వెంటనే అధికారుల దృష్టికి తేవాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.