ఈడీ అరెస్ట్ నుంచి చిదంబరానికి ఊరట
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరానికి సుప్రీంకోర్టు కాస్త ఊరటనిచ్చింది. ఈడీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ పూర్తికాగా తీర్పును సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. అయితే అప్పటివరకు ఈడీ అరెస్టు నుండి చిదంబరానికి ఉపశమనం కలిగించింది. సుప్రీం ఈడీ నివేదికలు, విచారణ పత్రాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరానికి సుప్రీంకోర్టు కాస్త ఊరటనిచ్చింది. ఈడీ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ పూర్తికాగా తీర్పును సెప్టెంబర్ 5కు వాయిదా వేసింది. అయితే అప్పటివరకు ఈడీ అరెస్టు నుండి చిదంబరానికి ఉపశమనం కలిగించింది. సుప్రీం ఈడీ నివేదికలు, విచారణ పత్రాలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.