పాకిస్థాన్కు భారత సైన్యం తమ సత్తా ఎంటో మరోసారి రుచిచూపించింది. గత కొద్ది రోజులుగా ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే.. పాకిస్థాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ మనదేశంలోకి ఉగ్రవాదులను ఎగదోసేందుకు అనేక కుట్రలకు పాల్పడుతోంది. తాజాగా.. నేపాల్ మీదుగా.. మన దేశంలోకి 200 మంది కరోనా పాజిటివ్ ఉన్న ఉగ్రవాదులను పంపించేందుకు కూడా కుట్రలు పన్నినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చిరించిన విషయం తెలిసిందే. గత నెల చివరి వారం నుంచి.. తరచూ పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు భారత సైన్యం పాక్ కవ్వింపుచర్యలకు చెక్ పెడుతూ వస్తోంది.తాజాగా.. శుక్రవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన పాక్.. కుప్వారాలోని కేరన్ సెక్టార్ మీదుగా కాల్పులకు దిగింది.
దీంతో వెంటనే అలర్ట్ అయిన భారత సైన్యం.. సరిహద్దుకు సమీపంలో ఉన్న టెర్రర్ లాంచ్ప్యాడ్లను టార్గెట్ చేసుకుని కాల్పులకు దిగింది. భారత్ జరిపిన దాడిలో వక్రబుద్ది కలిగిన పాకిస్థాన్కు భారీ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. భారత సైన్యం ఎంచుకున్న లక్ష్యాలతో పాటు.. ఓ లాంచ్ ప్యాడ్ కూడా ఈ దాడుల్ఓల ధ్వంసమై ఉంటుందని భారత ఆర్మీ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
#WATCH Video shot from drone as Indian army precision targets Pakistani terror launch pads (video source: Indian Army) pic.twitter.com/gjTtbARadv
— ANI (@ANI) April 10, 2020