Road Accident in Delhi: ఫ్లైఓవర్ మీద స్పోర్ట్స్ సైకిల్ను ఢీకొన్న లగ్జరీ కారు.. ప్రమాదంలో రైడర్ మృతి..
అధికశాతం రోడ్డు ప్రమాదాలు జరగడానికి అతివేగం, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలను నడపడమే కారణం. ఢిల్లీలో కూడా అలాాగే అతివేగంగా వెళ్లన ఓ కారు వెళ్లి స్పోర్ట్స్ సైకిల్ను..
అధికశాతం రోడ్డు ప్రమాదాలు జరగడానికి అతివేగం, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలను నడపడమే కారణం. ఢిల్లీలో కూడా అలాాగే అతివేగంగా వెళ్లన ఓ కారు వెళ్లి స్పోర్ట్స్ సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సైకిల్ మీద ఉన్న వ్యక్తి ఆసుపత్రికి తీసుకువెళ్తున్న క్రమంలోనే మరణించాడు. ఆదివారం నైరుతి ఢిల్లీలోని మహిపాల్పూర్ ఫ్లైఓవర్ ఈ ప్రమాదం జరగింది. బీఎమ్డబ్ల్యూ కార్ అదుపుతప్పి స్పోర్ట్స్ సైకిల్ను ఢీకొట్టడంతో దానిపై ఉన్న వ్యక్తి మరణించాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కారు టైర్ పగిలిపోవడంతో అది డ్రైవర్ అదుపు తప్పి ఈ ప్రమాదానికి దారితీసిందని వారు తెలిపారు. కారు డ్రైవర్ను అరెస్ట్ చేసామని ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నైరుతి) మనోజ్ సి తెలిపారు.
వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తాము అక్కడకు వచ్చేసరికి మహిపాల్పూర్ ఫ్లైఓవర్ మీద ధౌలా కువాన్ వైపు.. రోడ్డుకు ఒక మూలన కారు, స్పోర్ట్ సైకిల్ పడి ఉన్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన స్పోర్స్ట్ సైకిల్ రైడర్ను పోలీసులు హాస్పిటల్కు తీసుకువెళ్లారు. కానీ అప్పటికే అతన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి గుర్గావ్ సెక్టార్-49 నివాసి శుభేందు చార్టర్జీగా వారు గుర్తించారు.
కాగా, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా కారును నడిపినందుకు డ్రైవర్ మీద భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 279 (రాష్ డ్రైవింగ్ లేదా బహిరంగ మార్గంలో రైడింగ్), 304ఏ (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం) ప్రకారం కేసు నమోదు చేసి, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..