Covid 4th Wave: భారత్లో ఫోర్త్ వేవ్ అలర్ట్.. 8 వేల మార్క్ దాటిన కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?
ప్రభావం అంతగా లేనప్పటికీ.. కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది.
Coronavirus 4th wave in India: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటంతో భయాందోళన నెలకొంది. తాజాగా.. కేసుల సంఖ్య 8 వేల మార్క్ దాటింది. దాదాపు మూడు నెలల అనంతరం కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ప్రభావం అంతగా లేనప్పటికీ.. కరోనా నిబంధనలు పాటించాలని, జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. శుక్రవారం 8,329 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కేసుల సంఖ్య 745 మేర పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి (Coronavirus) కారణంగా దేశవ్యాప్తంగా 10 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత రోజువారీ కేసుల సంఖ్య 8 వేల మార్క్ దాటడం ఇదే మొదటిసారి.
ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల సంఖ్య 40,370 కి పెరిగినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో దేశంలో మొత్తం 4,216 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ రేటు దాదాపు 98.69 శాతంగా ఉంది.
- దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య – 4,32,13,435
- కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య – 4,26,48,308
- దేశంలో మరణాల సంఖ్య 5,24,757 కి చేరింది.
ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా COVID-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 194.92 కోట్ల డోసులను పంపిణీ చేశారు. నిన్న 15,08,406 మందికి టీకాలు ఇచ్చారు.
#COVID19 | India reports 8,329 fresh cases, 4,216 recoveries, and 10 deaths in the last 24 hours.
Total active cases are 40,370 pic.twitter.com/svqgvbjtpx
— ANI (@ANI) June 11, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..