Covid 4th Wave: దేశంలో లక్ష మార్క్ దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. గత 24 గంటల్లో 18 వేలకు పైగా నమోదు..
తాజాగా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 18,819 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 39 మంది మరణించారు.
India Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ తర్వాత భారీగా తగ్గిన కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాగా.. గత 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. తాజాగా 18 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 18,819 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 39 మంది మరణించారు. నిన్నటి పోల్చుకుంటే కేసుల సంఖ్య 4313 మేర కేసులు, 9 మరణాలు పెరిగాయి. ఒక్కరోజులో 29.7 శాతం కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 1,04,555 (0.24 శాతం) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో పాజిటివిటీ రేటు 4.16 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.55 శాతం ఉంది.
దేశంలో నమోదైన కరోనా గణాంకాలు..
- దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,34,52,164 కి పెరిగింది.
- కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,116 కి చేరింది.
- నిన్న కరోనా నుంచి 13,827 మంది బాధితులు కోలుకున్నారు.
- కోలుకున్న వారి సంఖ్య 4,28,22,493 కి చేరింది.
- దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 197,61 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
- నిన్న 14,17,217 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
కేరళలో అత్యధికంగా..
దేశంలో నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 4,459 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 3,957, కర్ణాటకలో 1,945, తమిళనాడులో 1,827, పశ్చిమ బెంగాల్లో 1,424 కేసులు నమోదయ్యాయి.
#COVID19 | India reports 18,819 fresh cases and 39 deaths, in the last 24 hours.
Active cases 1,04,555 Daily positivity rate 4.16% pic.twitter.com/A0RaRud8Nr
— ANI (@ANI) June 30, 2022