నా భార్య పిల్లల్ని తీసుకొస్తే 10 లక్షలిస్తా.. ఎన్‌ఆర్‌ఐ నజరానా.. కండిషన్స్ అప్లై!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది పలుచోట్ల ఇరుక్కున్న విషయం తెలిసిందే. దాదాపు 40 రోజులకు పైగా తమ సొంతవారికి దూరంగా బతుకుతున్నారు కొంతమంది.

నా భార్య పిల్లల్ని తీసుకొస్తే 10 లక్షలిస్తా.. ఎన్‌ఆర్‌ఐ నజరానా.. కండిషన్స్ అప్లై!
Follow us

| Edited By:

Updated on: May 09, 2020 | 4:18 PM

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది పలుచోట్ల ఇరుక్కున్న విషయం తెలిసిందే. దాదాపు 40 రోజులకు పైగా తమ సొంతవారికి దూరంగా బతుకుతున్నారు కొంతమంది. ఇంకా ప్రజా రవాణాకు అనుమతులు ఇవ్వకపోవడంతో.. దుబాయ్‌కి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం వేర్వేరు రాష్ట్రాల్లో చిక్కుకుపోయింది. ఈ క్రమంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చిక్కుకున్న తన భార్య బిడ్డల్ని కేరళకు సురక్షితంగా చేర్చితే రూ.10లక్షలు ఇస్తానని ఆయన నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌లో తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన శ్రీకుమార్ అనే వ్యక్తి యూఏఈలో కెమికల్ బిజినెస్ చేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో తన భార్య బిడ్డలు వేర్వేరు రాష్ట్రాల్లో ఇరుక్కుపోగా.. వారిని సొంత రాష్ట్రం తరలించేందుకు ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడు. దానికి ఏవియేషన్ అధికారుల నుంచి అనుమతులు నిరాకరించడంతో.. సోషల్ మీడియాలో తన ఆఫర్ ప్రకటించారు. ఇక ఈ ఆఫర్‌కు కాల పరిమితిని కూడా విధించారు శ్రీకుమార్. మే 12 అర్ధరాత్రి లోపు వరకు మాత్రమే ఈ ఆఫర్‌ ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ఈ ప్రక్రియ అంతా చట్టబద్ధంగా ఉండాలన్న కండీషన్‌ కూడా పెట్టాడు. ఇక పబ్లిసిటీ కోసం తాను ఇలా చేయడం లేదని.. తన ఫ్యామిలీని ఒక చోటుకు చేర్చడం కోసం ఇలా చేస్తున్నాని వివరించాడు. ఇక సోషల్ మీడియాలో తన కుటుంబం వివరాలు కూడా ఆయన వెల్లడించాడు.

Read This Story Also: విషాదం.. కరోనాకు విరుగుడు కనుగొంటూ ఫార్మా కంపెనీ ఉద్యోగి మృతి..!