కొవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ పురోగతిని ప్రకటించిన భారత్ బయోటెక్.. 26 వేల మందికి టీకా ఇవ్వడమే లక్ష్యం
దేశంలో కరోనా మహమ్మారి విబృంభిస్తోంది. ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వైరస్ ను అరికట్టేందుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలు సైతం....
దేశంలో కరోనా మహమ్మారి విబృంభిస్తోంది. ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వైరస్ ను అరికట్టేందుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ వైరస్ కట్టడికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా మూడో దశ పురోగతిని భారత్ బయోటెక్ మంగళవారం వెల్లడించింది. ఇప్పటి వరకు 13 వేల మంది వాలంటీర్లకు కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపింది. మూడో దశలో 26 వేల మందికి టీకా ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు సగం లక్ష్యం పూర్తి కావడంపై హర్షం వ్యక్తం చేసింది.
కొవాగ్జిన్ రెండు డోసులు ఇంజెక్టబుల్ టీకా, దీనిని దేశంలోని అందరికీ అందించాలంటే 260 కోట్ల సిరంజ్ లు, సూదులు అవసరం అవుతాయని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా ఇటీవల తెలిపారు. కాగా, కరోనాకు సంబంధించి ముక్కులో వేసుకొనే చుక్కల మందు పైనా భారత్ బయోటెక్ ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే.