Rahul Gandhi – ED: ఇవాళ మరోసారి ఈడీ విచారణకు రాహుల్ గాంధీ.. ఆగ్రహంతో కాంగ్రెస్ శ్రేణులు..
Rahul Gandhi - ED: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారి నిన్న రాహుల్ను..
Rahul Gandhi – ED: కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో తొలిసారి నిన్న రాహుల్ను 10 గంటల పాటు ఈడీ విచారణ చేసింది. రాత్రి వరకు విచారణ కొనసాగింది. తర్వాత ఈడీ ఆఫీస్ నుంచి బయలుదేరారు రాహుల్.
ఇకపోతే నేషనల్ హెరాల్డ్ కేసులో సోమవారం నాడు విచారణకు హాజరయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ. దాదాపు 10 గంటల పాటు రాహుల్ను విచారించారు ఈడీ అధికారులు. రాత్రి 11 గంటల సమయంలో ఈడీ ఆఫీసు నుంచి ఇంటికెళ్లారు రాహుల్. ఇవాళ మళ్లీ విచారణకు రావాలని రాహుల్ను ఆదేశించారు. కాగా, 10 గంటల పాటు సాగిన ఈ విచారణలో నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈడీ. విదేశీ బ్యాంక్ ఖాతాలు, ఆస్తులపై సూటిగా ప్రశ్నించారు అధికారులు. 50కి పైగా ప్రశ్నలడిగారు. తనకేమీ తెలియదని రాహుల్ సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది.