Shashi Tharoor: ఆరుగురు మహిళా ఎంపీలతో శశిథరూర్ సెల్ఫీ.. “అందమైన” ట్వీట్పై మహిళా సంఘాల ఆగ్రహం..
పార్లమెంట్ అందాన్ని పొగిడేశారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ . అయితే ఆ పొగడ్తకు ఉపయోగించిన సెల్ఫీపై వివాదం రాజుకుంది. మహిళా ఎంపీలను కించపర్చారని థరూర్పై విమర్శలు వెలువెత్తాయి.
పార్లమెంట్ అందాన్ని పొగిడేశారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ . అయితే ఆ పొగడ్తకు ఉపయోగించిన సెల్ఫీపై వివాదం రాజుకుంది. మహిళా ఎంపీలను కించపర్చారని థరూర్పై విమర్శలు వెలువెత్తాయి. ఆయనో బాధ్యత కలిగిన ఎంపీ . మన్మోహన్ సర్కార్లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది . కాని వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు శశిథరూర్. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆరుగురు మహిళా ఎంపీలతో సెల్ఫీ దిగిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు శశిథరూర్ . ఫోటో ట్వీట్ చేస్తే ఫర్వా లేదు కాని .. ఆయన చేసిన కామెంట్స్ చిచ్చురేపాయి.
లోక్సభ కూడా చాలా అందమైన ప్రదేశమని చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనమని ట్వీట్ చేశారు శశిథరూర్. లోక్సభ ఆకర్షణీయమైన ప్రదేశం కాదని ఎవరన్నారు ? నా తోటి ఆరుగురు ఎంపీలను చూస్తే మీకు అసలు విషయం అర్ధమవుతుంది అని ట్వీట్ చేశారు శశిథరూర్. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో పాటు ఎంపీలు ప్రణీత్ కౌర్ , తమ్మిజాచి తంగపాండ్యన్ , మిమి చక్రవర్తి , నుస్రత్ జెహాన్ , జ్యోతిమణితో కలిసి సెల్ఫీ దిగారు శశిథరూర్.
ఈ ట్వీట్పై జాతీయ మహిళా కమిషన్ రేఖా శర్మతో పాటు పలువురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మహిళా ఎంపీలు ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నారని , ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఆ నేతలు శశిథరూర్ తన ట్వీట్తో కించపర్చారని మండిపడ్డారు .ఆడవాళ్లను ఆటవస్తువుగా చూడడం మానుకోవాలని శశిథరూర్కు హితవు పలికారు రేఖా శర్మ.
తన ట్వీట్పై వివాదం చెలరేగడంతో వివరణ ఇచ్చారు శశిథరూర్. ఆరుగురు ఎంపీలు కోరితేనే సరదాగా వాళ్లతో సెల్ఫీ దిగానని , అదే ఫోటోను ట్వీట్ చేసి కామెంట్ కూడా పెట్టాలని వాళ్లు కోరితేనే ట్వీట్ చేశానని వివరణ ఇచ్చారు థరూర్. పురుషులతో మహిళలు సమానమని చెప్పే వాళ్లలో తానే ముందుంటానని అన్నారు శశిథరూర్. తన ట్వీట్ను చాలామంది తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. మహళా హక్కుల కోసం పోరాడే వాళ్లకు తన మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. సరదాగా చేసిన ట్వీట్పై ఇలా వివాదం చేయడం తగదన్నారు.
ఇవి కూడా చదవండి: Leptin and Obesity: మీలో ఈ హార్మోన్లు పనిచేయకపోతే డయాబెటిస్ వచ్చినట్లే.. అవేం చేస్తాయో తెలుసా..
Kishan Reddy: ఆయన మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..