కోవాగ్జిన్ వల్ల ప్రజలు అస్వస్థత పాలైతే పరిహారం, ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.

కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కారణంగా ఎవరైనా తీవ్ర అస్వస్థులైతే వారికి పరిహారం అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం..

కోవాగ్జిన్ వల్ల ప్రజలు  అస్వస్థత పాలైతే పరిహారం, ప్రత్యేక  ఆసుపత్రుల్లో చికిత్స, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 16, 2021 | 12:18 PM

Covid Vaccine: కోవిడ్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ కారణంగా ఎవరైనా తీవ్ర అస్వస్థులైతే వారికి పరిహారం అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్ సెంటర్లలో  ప్రజలకు లేదా హెల్త్ లైన్ వర్కర్లకు అధికారులు అందజేసే అనుమతి పత్రాల్లో ఈ అంశానికి ప్రాధాన్యమిచ్చ్చారు. ముంబైలోని 60 ప్రభుత్వ ఆసుపత్రుల్లో గల సెంటర్లలో శనివారం ఈ టీకామందును ఇస్తున్నారు. కోవాగ్జిన్ తీసుకున్నవారిలో అస్వస్థతకు గురైనవారికి ప్రభుత్వం నిర్దేశించిన ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య చికిత్సను అందజేస్తారు. పైగా ఇలాంటి ఉదంతాల కేసులకు టీకామందు ఉత్పాదక సంస్థే బాధ్యత వహిస్తుందని ఈ పత్రాల్లో పేర్కొన్నారు. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ను అంగీకరించిన 11 రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. ఇప్పటివరకు ఈ మూడో దశ ట్రయల్స్ ఇంకా పూర్తికాని విషయం గమనార్హం. అటు వ్యాక్సిన్ తీసుకోగోరేవారు తమకు కోవిషీల్డ్ కావాలో, కోవాగ్జిన్ కావాలో ఎంపిక చేసుకోవాలని కూడా ఈ పత్రాల్లో కోరారు.

అయితే కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి సంబంధించి ఇలాంటి నిర్ణయాన్ని ప్రభుత్వం ఇంకా తీసుకోలేదు. ఈ టీకామందు అన్ని క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేసుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

Also Read:

Joe Biden Swearing Ceremony: అమెరికా అధ్యక్షుడు పెద్దన్న బైడెన్ ప్రమాణ స్వీకారంలో ఆడిపాడనున్న లేడీగాగా, జెన్నిఫర్‌ లోపెజ్

ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే

Union Ex-Minister Dead: కేంద్ర మాజీ మంత్రి కమల్ మొరార్కా మృతి, ఆయన మరణం తీరని లోటన్న రాజకీయ ప్రముఖులు