Farmers Protest: సింఘు బోర్డర్లో ఉద్రిక్త పరిస్థితులు.. రైతులపై రాళ్లు రువ్విన స్థానికులు.. పోలీసుల లాఠిఛార్జ్
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతమైన సింఘు బోర్డర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
Farmers Protest Updates – Singhu Border: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతమైన సింఘు బోర్డర్ వద్ద వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రెండు నెలలకుపైగా రైతులు ఆ ప్రాంతంలో నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాన్నరి ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానికులు భారీగా నిరసనకు దిగారు.
ఈ క్రమంలో కొంతమంది అల్లరిమూకలు రైతుల గుడారాలపై రాళ్లు విసరడంతోపాటు గుడారాలను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో రైతులు వారితో ప్రతిఘటించడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు రంగలోకి దిగి రైతులను, స్థానికులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా లాఠీచార్జ్ చేయడంతోపాటు టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించారు. ఈ ఘటనలో పోలీసు అధికారితో పాటు పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇలానే గురువారం రైతులు ఈ ప్రాంతాన్ని ఖాలీ చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
#WATCH: Delhi Police baton charges and uses tear gas shells to control the situation at Singhu border where farmers are protesting against #FarmLaws
A group of people claiming to be locals were also protesting at the site demanding that the area be vacated. pic.twitter.com/mF62LNB87j
— ANI (@ANI) January 29, 2021
#WATCH: Scuffle breaks out at Singhu border where farmers are protesting against #FarmLaws.
Group of people claiming to be locals have been protesting at the site demanding that the area be vacated. pic.twitter.com/XWBu9RlwLP
— ANI (@ANI) January 29, 2021
Also Read:
రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డు తగిలిన ఒకే ఒక్కడు.. రైతుల చట్టాలను రద్దు చేయాలని ప్లకార్డుల ప్రదర్శన