బీహార్ ఎన్నికలు, చిరాగ్ పాశ్వాన్ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్
బీహార్ ఎన్నికల్లో ఎల్ జె పీ (లోక్ జన శక్తి పార్టీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఎన్నికల రెండో దశలో 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తమ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ‘బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్’ అనే నినాదాన్ని అమలు చేస్తుందని చెప్పారు. (నవంబరు 3 న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి). నితీష్ కుమార్ ని తాము […]
బీహార్ ఎన్నికల్లో ఎల్ జె పీ (లోక్ జన శక్తి పార్టీ) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేశారు. ఎన్నికల రెండో దశలో 53 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..తమ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని, ‘బీహార్ ఫస్ట్, బిహారీ ఫస్ట్’ అనే నినాదాన్ని అమలు చేస్తుందని చెప్పారు. (నవంబరు 3 న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి). నితీష్ కుమార్ ని తాము సీఎం ని కానివ్వబోమని, అయితే అంతమాత్రాన ప్రధాని మోదీని తాము విమర్శిస్తున్నట్టు కాదని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. బీజేపీ తమకు దాదాపు మిత్ర పార్టీ అని ఈయన చెబుతుండగా రాష్ట్ర, బీజేపీ నేతలేమో ఈయనను అదేపనిగా విమర్శిస్తున్నారు. చిరాగ్ ఆధ్వర్యంలోని పార్టీ కేవలం ఓట్లను చీల్చేందుకే ఏర్పడిన పార్టీ అని, దానికి అధికారం రావడం కల్ల అని వ్యాఖ్యానిస్తున్నారు.ఈ రాష్ట్రంలో కమలం పార్టీ 121 స్థానాలకు పోటీ చేస్తోంది. జేడీ-యూ 122 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టింది