పలు షరతులతో తెరుచుకోనున్న కోయంబేడు మార్కెట్
తమిళనాడులో కరోనా హాట్స్పాట్గా మారిన కోయంబేడు మార్కెట్ మళ్లీ తెరుచుకోనుంది. ఈ నెల 28 నుంచి అక్కడ షాపులు తెరిచేందుకు
Chennai Koyambedu Market: తమిళనాడులో కరోనా హాట్స్పాట్గా మారిన కోయంబేడు మార్కెట్ మళ్లీ తెరుచుకోనుంది. ఈ నెల 28 నుంచి అక్కడ షాపులు తెరిచేందుకు అధికారులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఇందులో దాదాపుగా 3వేల వరకు దుకాణాలు ఉండగా.. విడతల వారీగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.తొలి విడతలో 300 దుకాణాలు తెరవనున్నారు.
అయితే ఈ మార్కెట్ కారణంగా దాదాపు 3వేల మందికి కరోనా వైరస్ సోకినట్లు అంచనా వేశారు. అంతేకాదు ఏపీ నుంచి ఈ మార్కెట్కి వెళ్లి వచ్చిన వారు సైతం వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో దీన్ని మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయంగా వేరే చోట చిన్న చిన్న బజార్లను ఏర్పాటు చేసింది. దీంతో అక్కడి వ్యాపారులు, సిబ్బంది తీవ్రంగా నష్టపోయారు. ఇక మార్కెట్కి వచ్చే వారంతా ఈ-కామర్స్ పోర్టల్స్కి అలవాటు పడుతున్నారని, దీంతో భవిష్యత్లో తాము తీవ్రంగా నష్టపోయే అవకాశం వస్తుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక ప్రస్తుతం దాదాపుగా అన్ని తెరుచుకుంటుండగా.. కోయంబేడును తెరిచేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పటిష్ట నిబంధనలతో విడతల వారీగా మార్కెట్ని తెరిచేందుకు అధికారులు అనుమతిని ఇచ్చారు.
Read More: