Ram Nath Kovind: భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్యంపై ఆరా తీసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి కోవింద్కు ఛాతీనొప్పి రావడంతో దేశ
Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి కోవింద్కు ఛాతీనొప్పి రావడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతి ఆరోగ్యంపై ఆరా తీస్తూ రాష్ట్రపతి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని , త్వరగా కోలుకుని సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను..అంటూ ట్వీట్ చేశారు.
కాగా, వైద్య పరీక్షల నిర్వహించిన అనంతరం రాష్ట్రపతి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ఛాతీలో కొద్దిపాటి నొప్పితో రాష్ట్రపతి ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ప్రతి నెలా జరిగే వైద్మయ పరీక్షలే నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నట్లు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.
కాగా, రాష్ట్రపతి ఇటీవల కరోనా వ్యాక్సిన్ను వేయించుకున్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత మార్చి 3వ తేదీన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో రామ్నాథ్ కోవింద్ వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నారు. మార్చి 8న ఆయన సతీమణి తొలి డోసు వేయించుకున్నారు.
ఇవీ చదవండి:
PM Kisan : బెంగాల్ రైతులకు ఆ సాయం రాకుండా అడ్డుకున్న పాపం ముఖ్యమంత్రి మమతదే.. బీజేపీ ఆరోపణ