Rajasthan: రాజస్థాన్ ముఖ్యమంత్రి సోదరుడి ఇంట్లో సీబీఐ సోదాలు.. హాట్ టాపిక్ గా మారిన తనిఖీలు
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్(Ashok Gehlot) సోదరుడు అగ్రసేన్ గెహ్లాత్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసిట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. జోధ్ పుర్ లోని...
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్(Ashok Gehlot) సోదరుడు అగ్రసేన్ గెహ్లాత్ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో దాడులు చేసిట్లు సంబంధిత వర్గాలు వెల్లడించారు. జోధ్ పుర్ లోని అగ్రసేన్ ఇల్లు, కార్యాలయాల్లో దాడులు కొనసాగాయి. గతంలో ఎరువుల కుంభకోణానికి సంబంధించి ఆయన ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. 2007-2009 లో భారీగా ఎరువుల అక్రమ ఎగుమతికి పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. మన దేశ రైతులకు సబ్సిడీ కింద అందించాల్సిన పొటాష్ను అక్రమంగా విదేశాలకు తరలించినట్లు వెల్లడించింది. మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
దేశ రజధాని ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సోదరుడి నివాసంలో సోదాలు జరగడం గమనార్హం. ఇవన్నీ ప్రతికార రాజకీయాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఆరోపించారు. కక్షపూరిత రాజకీయ చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. వచ్చే ఏడాది రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
CBI (Central Bureau of Investigation) conducts a raid at residence of Rajasthan CM Ashok Gehlot’s brother, Agrasen Gehlot in Jodhpur: Sources
— ANI (@ANI) June 17, 2022