ప్రధాని మోదీ ఫోటోలు వాడొద్దు, చిరాగ్ పాశ్వాన్ కి బీజేపీ హెచ్ఛరిక

బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫోటోలను వాడరాదని లోక్ జన శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ని బీజేపీ నాయకత్వం హెచ్ఛరించింది. అలాగే ప్రచారం సందర్భంగా మోదీ పేరును కూడా..

ప్రధాని మోదీ ఫోటోలు వాడొద్దు, చిరాగ్ పాశ్వాన్ కి బీజేపీ హెచ్ఛరిక
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 06, 2020 | 8:05 PM

బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫోటోలను వాడరాదని లోక్ జన శక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ని బీజేపీ నాయకత్వం హెచ్ఛరించింది. అలాగే ప్రచారం సందర్భంగా మోదీ పేరును కూడా ఎల్ జేపీ వాడకుండా చూడాలని ఆదేశించవలసిందిగా   ఎన్నికల కమిషన్ ని కూడా కమలనాథులు కోరనున్నట్టు సమాచారం. భారతీయ జనతా పార్టీతో తాము కలిసి ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, నితీష్ ఆధ్వర్యాన గల  జేడీ-యు తరఫున పోటీ చేసే అభ్యర్థులపై తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతామని చిరాగ్ పాశ్వాన్ ఇదివరకే ప్రకటించారు. నితీష్ ఓటమికి తాము ప్రయత్నిస్తామన్నారు. అయితే ఈ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి నితీష్ కుమారే నని బీజేపీ స్పష్టం చేసింది.