Coronavirus: గోమూత్రంతో క‌రోనా ఖ‌తం.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో వైర‌ల్

దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఆందోళ‌న క‌లిగిస్తుంది. యూపీలో కూడా ప్రతిరోజూ వేలాది కొత్త కరోనా సంక్రమణ కేసులు వస్తున్నాయి.

Coronavirus: గోమూత్రంతో క‌రోనా ఖ‌తం.. బీజేపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. వీడియో వైర‌ల్
Cow Urine For Covid
Follow us

|

Updated on: May 08, 2021 | 9:30 AM

దేశంలో కరోనా సెకండ్ వేవ్ టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య ఆందోళ‌న క‌లిగిస్తుంది. యూపీలో కూడా ప్రతిరోజూ వేలాది కొత్త కరోనా సంక్రమణ కేసులు వస్తున్నాయి. రోగుల సంఖ్య పెరుగుతున్న కారణంగా, ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజ‌న్ కు కొర‌త ఏర్ప‌డుంది. ఈ క్ర‌మంలో అక్క‌డి బల్లియాకు చెందిన బిజెపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కోవిడ్ ను నివారించడానికి రోజూ ఆవు మూత్రం తాగాలని ప్రజలకు సలహా ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. క‌రోనాను ఎదుర్కోడానికి రోజూ గో మూత్రం తాగాలంటూ సురేంద్ర సింగ్ చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ స‌ర్కులేట్ అవుతుంది. స‌ద‌రు వీడియోలో తాను రోజూ గో మూత్రం తీసుకుంటున్నానని..అందుకే త‌న‌కు క‌రోనా సోక‌డం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

‘బెరియా అసెంబ్లీ ప్రజలకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఇది పతంజలి గోదాన్ సారం. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో చల్లటి నీటిలో ఐదు మూతలు కలిపిన తరువాత నేను ఆవు మూత్రాన్ని తాగుతాను. దాని శాస్త్రీయ అంశాలు ఏమిటో నాకు తెలియదు. కానీ దీనిని తాగిన‌ తరువాత, రోజూ నేను మీ అందరి మధ్య 18 గంటలు నిరంతరం గ‌డుపుతాను. అయినా కానీ నాకు కరోనా సోక‌లేదు. కరోనా వంటి అంటువ్యాధుల నియంత్రణను ఆవు మూత్రం లేదా ఆవు సారం తీసుకోవడం మాత్ర‌మే అస‌లైన ప‌రిష్కార‌మ‌ని నమ్ముతున్నాను’.. అని. ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ స‌ద‌రు వీడియోలో చెప్పుకొచ్చాడు.

Also Read:  కరోనాతో సతమతమవుతున్న ఏపీ రైతాంగానికి జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్

భార్యను బ్లేడుతో కోసి చంపిన భర్త.. హ‌త్య వెనుక కరోనా వ్య‌ధ‌.. వివ‌రాలు ఇవి