Bengaluru: వీడు మనిషా, పశువా.. భార్య తలపై మూత్రం పోసి అరాచకం
మంచి సంబంధం అని భారీగా కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేశారు. కానీ ఆ దరిద్రుడు డ్రగ్స్ బానిసయ్యడానికి ఆమెకు కాపురానికి వెళ్లగానే తెలిసిపోయింది.
వీడు మనిషా, పశువా నిజంగా అర్థం కాని పరిస్థితి. డ్రగ్స్ వల్ల మనుషులు మరీ ఇలా తయారవుతారా అని అనిపిస్తుంది. తాజాగా బెంగళూరులో దారుణ ఘటన వెలుగుచూసింది. మత్తులో తనపై యూరిన్ పాస్ చేశాడని భర్తపై ఓ వివాహిత కంప్లైంట్ చేసింది. దీంతో బసవనగడి కాప్స్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు షురూ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలోని ఓ షాపింగ్ మాల్ ఓనర్ కూతురుని.. సందీప్ అనే వ్యక్తికి ఇచ్చి ఈ ఏడాది జనవరిలో గ్రాండ్గా పెళ్లి చేశారు పెద్దలు. భారీగా కట్నం ఇచ్చారు. హై ఎండ్ కార్తో పాటు, 4 కేజీల గోల్డ్ ఇంకా 2 షాపింక్ మాల్స్ డౌరీ కింద ఆ మహానుభావుడికి ఇచ్చారు. కానీ అతడు వెదన అని ఆ ఆడకూతురికి కాపురానికి వెళ్లగానే తెలిసిపోయింది. డ్రగ్స్ తీసుకోవడం, ఫ్రెండ్స్ను ఇంటికి తీసుకొచ్చి మందు పార్టీలతో రచ్చ చేయడం చూసి కంగుతింది. వద్దని వారించేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఆమె మాటలను పట్టించుకోలేదు. కొన్నాళ్లు బాధను భరించింది. కానీ ఆ దరిద్రుడు ఆమెపై దాడి చేయడం, భూతులు తిట్టడం కూడా ప్రారంభించాడు. ఇటీవల ఈ వేధింపులు తీవ్ర స్థాయికి వెళ్లాయి. భార్యతో ఘర్షణపడి.. ఆమె తలపై మూత్ర విసర్జన చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి