కోరోనిల్తో కరోనా పేషెంట్లు కోలుకున్నారు.. రాందేవ్ బాబా..
కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి..
కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్కు వ్యాక్సిన్ లేకపోవడంతో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ మహమ్మారి కరోనాకు ఆయుర్వేద మెడిసిన్తో చెక్ పెట్టవచ్చంటూ ఇటీవల పతంజలి సంస్థ పేర్కొంది. అంతేకాదు కోరోనిల్ అనే కరోనా కిట్ను కూడా విడుదల చేసింది. అయితే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కేంద్ర ఆయుష్ డిపార్ట్మెంట్ దీనికి బ్రేకులు వేసింది. అంతే కాదు పతంజలి సంస్థకు నోటిసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో మంగళవారం నాడు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ కరోనాకు తాము మందును కనుగొనలేదని బదులిచ్చారు.
అయితే తాజాగా బుధవారం నాడు.. యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. మరోసారి తాము తయారు చేసిన మెడిసిన్ ద్వారా కరోనా సోకిన పేషెంట్లు కోలుకున్నారని బదులిచ్చారు. తమ పరిశోధనలో 67 శాతం మంది మూడు రోజుల్లోనే కోలుకోగా.. ఏడు రోజుల్లో వంద శాతం కోలుకున్నారని తెలిపారు. అంతేకాదు తాము నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయుష్ మంత్రిత్వ శాఖకు అందజేశామని తెలిపారు. తాము చేసిన ట్రయల్స్లో 45 మంది కరోనా సోకిన పేషెంట్లు త్వరగానే కోలుకున్నారని.. అందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని రాందేవ్ చెప్పుకొచ్చారు.
Patanjali claims that “#COVID19 patients group that received its medicines, showed 67% recovery in 3 days & 100% recovery in 7 days of treatment, that is, all 45 patients became COVID negative”; says all clinical trial documents have been shared with AYUSH Ministry. pic.twitter.com/jSMTxCwLp8
— ANI (@ANI) July 1, 2020