Ayodhya: 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం: మంత్రి కిషన్రెడ్డి
Ayodhya: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న మందిర నిర్మాణం కోసం చకచక జరుగుతున్నాయి. ఇక 2030 నాటికి..
Ayodhya: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎంతగానో ఎదురు చూస్తున్న మందిర నిర్మాణం కోసం చకచక జరుగుతున్నాయి. ఇక 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అవతరిస్తుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. నిన్న అయోధ్యలో జరిగిన దిపోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రామ మందిర నిర్మాణం త్వరగా పూర్తి చేస్తామ, ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షించడానికి దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో పర్యాటక అవకాశాలను కూడా పెంచుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యలో ప్రజలు రామాలయాన్ని సందర్శిస్తారన్నారు.
అయోధ్య సంకల్పం, వారసత్వం, ఆధ్యాత్మిక నగరం కాబట్టి త్వరలో పర్యాటకుల నగరంగా కూడా మారుతుందని అన్నారు. అలాగే అయోధ్యలో రైలు, రహదారి కనెక్టివిటీని మరింత మెరుగు పరిచేలా చర్యలు చేపడతామన్నారు. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు. రానున్న పదేళ్లలో పర్యాటకుల సంఖ్య ఐదు కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోందని అన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించినప్పుడు అది ప్రపంచంలోని అత్యుత్తమ ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటిగా మారుతుందని, భారతదేశ సాంస్కృతిక రాజధానిగా మారుతుందని అన్నారు. కాగా, దీపావళి సందర్భంగా ఇటీవల సరయు నది ఒడ్డున 9.5 లక్షల దీపాలను వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.
ఇవి కూడా చదవండి: