Assam to Cut Fuel Prices: ఆ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నవేళ పెట్రోల్ పై రూ. 5 తగ్గింపు మద్యంపై సుంకం 25 శాతం తగ్గింపు
దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎంపీ శశిథరూర్ వంటి వారు పెట్రోల్ డీజిల్ ను కొనాలంటే బ్యాంక్ లోన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్న తరుణంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఫై లీటరు కు ఏకంగా..
Assam to Cut Fuel Prices: దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎంపీ శశిథరూర్ వంటి వారు పెట్రోల్ డీజిల్ ను కొనాలంటే బ్యాంక్ లోన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తున్న తరుణంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ఫై లీటరు కు ఏకంగా రూ. 5 తగ్గిస్తూ అక్కడ బీజేపీ సర్కార్ వాహనదారులకు భారీ ఊరటనిచ్చింది. మరోవైపు మద్యం ప్రియులకు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు అసోం ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. సవరించిన ఈ రేట్లు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్ధిక మంత్రి హిమంత బిస్వాస్ అసోం అసెంబ్లీలో ప్రకటించించారు.
పెట్రోల్ ధర లీటర్ కు ఐదు రూపాయలు తగ్గడంతో లక్షలాది మంది వాహన వినియోగదారులకు లాభం చేకూరుతుందని.. చెప్పారు. కోవిడ్ 19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సెస్ ను విధించాం.. అయితే ఇప్పుడు కరోనా రోజుల సంఖ్య బాగా తగ్గింది కనుక తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే అసోం లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంధన ధరలు తగ్గించడం విశేషం.. మార్చి, ఏప్రిల్ ల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం శర్భానందసోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ అధికారం మళ్ళీ దక్కించుకోవాలని భారీ కసరత్తులు చేస్తోంది.