‘చైనా గురించి చెప్పకుండా ‘చనా’ ప్రస్తావన ! మోదీపై ఒవైసీ ఫైర్
చైనా-భారత దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పకుండా 'చనా' (శనగలు) గురించి మాట్లాడారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశ సరిహద్దుల్లో..
చైనా-భారత దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి ప్రధాని మోదీ తన ప్రసంగంలో చెప్పకుండా ‘చనా’ (శనగలు) గురించి మాట్లాడారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశ సరిహద్దుల్లో ఇంత ఉద్రిక్తతలు రేగుతున్నా.. దాని గురించి ప్రస్తావించలేదన్నారు. ఇంతేకాదు.. అన్ని పండుగల గురించి ఆయన మాట్లాడారని, కానీ ముస్లిముల ‘ఈద్’ (బక్రీద్) గురించి మిస్సయ్యారని ఒవైసీ ఆరోపించారు. (జులై 31 న బక్రీద్).. ‘ మీ ప్లానింగ్ లేని లాక్ డౌన్ కారణంగా వేలాధి మంది ఆహారం లేక అల్లల్లాడారని, కానీ మీరు పండుగల గురించి మాట్లాడారని అంటూ ఒవైసీ.. ‘ అయినా మీకు ఈద్ ముబారక్’ చెబుతున్నానని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
.@PMOIndia aaj China par bolna tha, bol gaye CHANA par. Which was also necessary since your unplanned lockdown had left many working people without food.
Also noticed that you listed many festivals in coming months but missed Baqr Eid? Chaliye, phir bhi aapko peshgi Eid Mubarak
— Asaduddin Owaisi (@asadowaisi) June 30, 2020