హిందుఖుష్లో మరోసారి భూ ప్రకంపనలు
ఆఫ్ఘనిస్థాన్లోని హిందుఖుష్ ప్రాంతంలో ఆదివారం తెల్ల వారుజామున భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 3.8 మాగ్నిట్యూడ్గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపిన..
ఆఫ్ఘనిస్థాన్లోని హిందుఖుష్ ప్రాంతంలో ఆదివారం తెల్ల వారుజామున భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 3.8 మాగ్నిట్యూడ్గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపిన ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున 5.28 గంటలకు ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గడిచిన నెల రోజులుగా.. నిత్యం ఆఫ్ఘన్-భారత్ సరిహద్దు ప్రాంతాలతో పాటుగా.. మిజోరాం, త్రిపుర, అసోం. జమ్ముకశ్మీర్, లదాఖ్ పలు ప్రాంతాల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే వీటి తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి నష్టం కలగడం లేదు. నిత్యం వస్తున్న వరుస భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు.
An earthquake of magnitude 3.8 on the Richter scale struck Hindu Kush, Afghanistan at 5:28 am today: National Center for Seismology pic.twitter.com/jgf4Y6YEHb
— ANI (@ANI) July 19, 2020